వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Published: Tuesday November 22, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 21, ప్రజాపాలన: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సోమవారం రోజున మంచిర్యాల నియోజకవర్గం లోని హాజిపూర్ మండలంలోని ముల్కల్ల, గుడిపేట, నంనూర్, రాపల్లి  గ్రామలలో డి సి ఎం ఎస్ ఆధ్వర్యంలో  మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్,పార్టీ ప్రెసిడెంట్ మోగిలి శ్రీనివాస్,గ్రామ సర్పంచులు, ఎం.పి.టి.సి.సభ్యులు, వార్డు సభ్యులు ఏఎంసీ డైరెక్టర్లు పిఎసిఎస్ డైరెక్టర్లు  ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.