సిసి రోడ్ల నిర్మాణానికి 3.40 లక్షలు నిధులు మంజూరు..

Published: Wednesday January 18, 2023

ఇబ్రహీంపట్నం, జనవరి17(ప్రజాపాలన ప్రతినిధి ): మండలంలోని 17 గ్రామాలకు గాను ఈజీఎస్ నిధుల నుంచి మూడు కోట్ల 40 లక్షల రూపాయలు సిసి రోడ్లు వేయుటకు గౌరవ కోరుట్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మంజూరు చేసినట్లు ఎంపీపీ జాజాల భీమేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల వారీగా అమ్మక పేట గ్రామానికి 15 లక్షలు భర్తీ పూర్ 10 లక్షలు, డబ్బా 20 లక్షలు ఏర్ధడి 20 లక్షలు ,ఎర్రపూర్ 15 లక్షలు ఫకీర్ కొండాపూర్ 20 లక్షలు, గోధుర్ 20 లక్షలు, ఇబ్రహీంపట్నం 30 లక్షలు, కేశవపూర్ 10 లక్షలు,కొత్తూరు 10 లక్షలు, కోమటి కొండాపూర్ 15 లక్షలు, మూలరాంపూర్ 35 లక్షలు, తిమ్మాపూర్ 20 లక్షలు, తిమ్మాపూర్ తండా 30 లక్షలు,వర్షకొండ 25 లక్షలు, వేములకుర్తి 25 లక్షలు, యామాపూర్ 20 లక్షలు, మంజూరైనట్లు వెల్లడించారు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఎంపీపీ జాజాల భీమేశ్వరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి కోఆప్షన్ సభ్యుడు ఏలేటి చిన్నారెడ్డి ఎంపీటీసీలు పడాల మమత తిమ్మని రాములు నాయకులు జాజాల జగన్ రావు దేశెట్టి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.