శంకరపట్నంలో మాల మహానాడు పోస్టర్ ఆవిష్కరణ

Published: Monday April 10, 2023

శంకరపట్నం ఏప్రిల్ 09 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద మాల మహానాడు మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మాల,మాల ఉపకులాల ఆత్మగౌరవ సమ్మేళనం అనే వాల్ పోస్టర్ ను మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య ఆవిష్కరించారు. ఈనెల 12న  మండల కేంద్రంలో నిర్వహించే ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా మాల మహానాడు జాతియ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ హాజరవ్వనున్నారని, మండలంలోని మాల మాల ఉపకులాల ప్రజలు హాజరు కావాలని మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాడే శంకర్, పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, మాల మహానాడు పార్లమెంటరీ ఇంచార్జ్ బోలుమల్ల సదానందం, కార్యనిర్వాహణ అధ్యక్షుడు గరిగే ప్రభాకర్, మండల నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు