ఆందోళనలో ధాన్యం రైతులు సిపిఎం

Published: Monday May 10, 2021
మధిర, మే 9, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం లోని పలు గ్రామాల్లో ధాన్యం పండించిన రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని సిపిఎం పార్టీ మధిర రూరల్ మండల కార్యదర్శి మంద సైదులు అన్నారు ఈరోజు మధిర మండలం ఖమ్మం పాడు గ్రామం లో ధాన్యం రైతు లా కల్లా ల ను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల బ్రోకర్లు అడ్డగోలుగా అడుగుతున్నారని పండించిన పంటకు తెలంగాణలో గిట్టుబాటు లేక మార్కెట్ లేక రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నరని మరియు వాతావరణంలో మార్పులు అకాల వర్షాలకు పంటను కాపాడుకోలేక రైతులు సతమతమవుతున్న అని సిపిఎం పార్టీ బృందం ముందు వాపోయారు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని పార్టీ పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు పట్టణ మండల నాయకులు ఓట్ల శంకర్రావు పడకంటి మురళి వడ్రాణం మధు వాడి త్య లాలు రైతులు పాల్గొన్నారు