అలరించిన కవిసమ్మేళనం ** వజ్రోత్సవాలలో కవుల సంఘం
Published: Thursday August 18, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్ట్17 (ప్రజాపాలన, ప్రతినిధి) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దేశభక్తి కవి సమ్మేళనం లో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, భాషలో వచన పద్య గేయ కవితలను కవులు ఆలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్పాయి, రాజేశం లు, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆవులు స్వాతంత్ర వజ్రోత్సవాలు దేశభక్తి కవితా గానంలో, దేశభక్తిని చాటాలని, ఆసిఫాబాద్ కవులు కవిత, గాణాలతో ముందుండి జిల్లాకు మంచిపేరు తేవాలని కొనియాడారు. అనంతరం కవులను జ్ఞాపిక ప్రశంస పత్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పర్ష అశోక్, మరియాల ఉదయ్ బాబు, ఆసిఫాబాద్ కవుల సంఘం గౌరవ అధ్యక్షులు గుర్రాల వెంకటేశ్వర్లు, సలహాదారులు ధర్మపురి వెంకటేశ్వర్లు, నారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి చిలుకూరి రాధా కృష్ణ చారి, ప్రశాంత్, నల్గొండ రమేష్, కవులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: