మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టిఆర్ఎస్ నాయకులు.

Published: Friday October 28, 2022

 టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆదేశాలు మేరకు, బిజెపి ప్రభుత్వ మోడీ దిష్టిబొమ్మ దగ్ధం దగ్ధం చేసి నిరసన తెలియ చేయడం జరిగిందని గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మండల టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం అహంకారంతో, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలానే కుతంత్రంతో, మరో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నలుగురు ఎమ్మెల్యేలకి 4వందల కోట్లతో ప్రలోభ పెట్టడాన్ని నిరసనగా జన్నారం మండల కేంద్రంలో  బీజేపీ ప్రభుత్వ మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియ చేయడమైనది అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎంపిపి మాదాడి సరోజన, ఎఎంసి వైస్ చైర్మన్ గోట్లా రాజేష్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్, పోన్కల్ ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, భరత్ కూమర్, సతీష్, జనార్ధన్, రీయాజోధ్దీన్, శ్రీధర్, పత్తిరి రవి, ప్రజాప్రతినిధులు  కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.