అయ్యప్ప స్వామి భజనలతో మారుమోగిన శివరామ్ నగర్ కాలనీ

Published: Friday December 03, 2021
వికారాబాద్ బ్యూరో 02 డిసెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ పట్టణంలోని శివ రామ్ నగర్ కాలనీలో ఇడ్లీ రమేష్ స్వామి ఇంటి దగ్గర అయ్యప్ప స్వామి18 మెట్లు పడిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించారు. 18 మెట్ల పై జ్యోతులు వెలిగించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గురు స్వాములకు రమేష్ స్వామి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నర్సింలు గౌడ్, యాదయ్య, రమణ, కృష్ణ, గంగారం ఓంకార్ స్వామి, భూపాల్ రెడ్డి, డొకోమో రవి, భూమయ్య, జొన్నల రవిశంకర్ లు పాల్గొన్నారు.