ప్రజల సహకారంతోనే వజ్రోత్సవాలు విజయవంతం
మధిర ఆగస్టు 19 ప్రజా పాలన ప్రతినిధి ప్రజల సహకారంతోనే మధిర మండలంలో భారత స్వతంత్ర వజ్రోత్సవాలను విజయవంతం చేసినట్లు వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు సిఐ వడ్డేపల్లి మురళి తహసిల్దార్ రాంబాబు ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి కమిషనర్ అంబటి రమాదేవి పేర్కొన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో ప్రధాన కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని వారు పేర్కొన్నారు ఈనెల 13 నుండి 15 వరకు ప్రతి ఒక్కరు తమ తమ గృహాలపై వ్యాపార సముదాయాలపై జాతీయ జెండాలను కట్టి దేశభక్తిని చాటుకున్నారని వారి పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ గృహాలపై వ్యాపార సమోదాలపై కట్టిన జాతీయ జెండాలను తొలగించి భద్రపరచుకోవాల్సిందిగా వారు కోరారు. జాతీయ గీతాలపన ఫ్రీడమ్ రన్ కార్యక్రమాలలో భాగస్వాములైన వారందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో ఎస్సై సతీష్ కుమార్ పాల్గొన్నారు
Share this on your social network: