బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ బేషరతుగా క్షేమాపన చెప్పాలి
Published: Tuesday July 27, 2021
జగిత్యాల, జులై 26 (ప్రజాపాలన ప్రతినిధి) : బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తాగుబోతులు త్రాగుతారని భుద్దిలేని మాటలు అనడంతో వెంటనే బేషరతుగా క్షమాపన చెప్పాలని జగిత్యాల జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దుమాల రాజ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ పార్టీ దళిత నాయకులు దళితులపై ఆయనకున్న వ్యతిరేక స్వభావాన్ని గుర్తించాలని ప్రతి ఒక్కరూ ఆలోచించి పెద్ద ఎత్తున ఖండించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని దళితుల ఆర్థికాభివృద్ధి కొరకు దళితబంధు పథకం ప్రవేశపెట్టారని పది లక్షలు ఇస్తానంటే ఓర్చుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు. రాబోయే హుజురాబాద్ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పుతమని రాజ్ కుమార్ హెచ్చరించారు.
Share this on your social network: