అటవీ అధికారుల కొవ్వొత్తుల ర్యాలీ

Published: Friday November 25, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 23 (ప్రజాపాలన, ప్రతినిధి) :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు మృతికి సంతాపంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద గురువారం సాయంత్రం డీఎఫ్ఓ దినేష్ కుమార్ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఫారెస్ట్ రేంజ్ అధికారి మృతి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు పరండే సాయి, మహేష్, డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్, అరోజా రాణి, సెక్షన్ అధికారులు మహేందర్, భగవంత్ రావు,వెంకటేష్, విజయ్, ప్రకాష్, స్వప్న,తదితరులు పాల్గొన్నారు.