ఎన్జీవో శ్రీనివాస్ దంపతులకు ఘన సన్మానం.. తల్లాడ, ఏప్రిల్ 7 (ప్రజాపాలన న్యూస్):

Published: Saturday April 08, 2023
 తల్లాడ శ్రీ లక్ష్మీ మండల సమాఖ్య మహిళ సభ్యులకు గ్రామ దీపికలకు డ్వాక్రా సంఘాలకు జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ రథసారథి రెండు తెలుగు రాష్ట్రాల సామాజిక కార్యకర్తలు వక్తలు గేయ రచయిత పలు రకాల సాంస్కృతిక కళాకారులు  నిపుణులు లీగల్  ఆడ్వైజర్ డాక్టర్ బొడ్డపాటి దాసు ఆధ్వర్యంలో పలు రకాల ప్రభుత్వ జీవోలు భారత రాజ్యాంగంలో రక్షణ హక్కుల చట్టాలపై  తల్లాడ ఐ కె పి ప్రాజెక్టు మేనేజర్, సి డి పి వో కల్లూరు ఐ సి డి యస్ కృష్ణ కుమారీ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ గ్రామ మహిళలకు అవగాహన కల్పించారు.
అనంతరం యన్ జీ వో మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ నిర్వహకులు చేసిన సేవలను గుర్తించి ,,హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్,, ఆంధ్రా తెలంగాణా సంయుక్త కార్యకర్తల సమక్షంలో  శ్రీనివాస్, వారి ధర్మ పత్నీ సైదమ్మ లకు ఘన స్వాగతం పలికి పూల మాలలతో శాలువా సత్కరాలతో మెమోంటో జ్ఞాపిక ప్రసంశ పత్రాలు అందించి సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో కల్లూరు ఐ సీ డీ యస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణ కుమారి, వెలుగు ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసరావు,సి సి లు భద్రమ్మ, నిర్మలా, నాగమణి, సుభద్రా, నరసింహ రావు, సుందర్ రావు, అకౌంటేట్ స్వాతి, పారా లీగల్ వాలంటీర్ పద్మా, మాజీ జెట్ పి టి సి మూకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.