వికారాబాదులో జియో ఫైబర్ ఇంటర్నెట్ సేవలు

Published: Friday March 10, 2023
* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 9 మార్చి ప్రజాపాలన : జియో ఫైబర్ ఇంటర్నెట్ సేవలు వికారాబాద్ ప్రాంతంలో విస్తరించడం శుభ పరిణామం అనే వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్ లో జియో ఫైబర్ ఇంటర్నెట్ సేవలను డిస్ట్రిబ్యూటర్ పలయాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. డిస్ట్రిబ్యూటర్ పి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హై స్పీడ్ ఇంటర్నెట్ 550 ప్లస్ ఆన్ డిమా డిమాండ్ చానల్స్ 14 ప్లస్ ఓ టి టి యాప్లు టీవీలో వీడియో కాలింగ్ ఫ్రీ వైఫై రూటర్ 4కె ఫ్రీ సెట్ టాప్ బాక్స్ ఫ్రీ ఇన్స్టాలేషన్ జీరో సెక్యూరిటీ డిపాజిట్ వంటి సౌకర్యాలను జియో ఫైబర్ ఇంటర్నెట్ ఆధ్వర్యంలో అందించనున్నామని పేర్కొన్నారు. మీ ప్రస్తుత టివీలో అన్ని ఒటిటిలను కేవలం 499 రూపాయలతో ప్రారంభమగునని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణారెడ్డి కొండేటి కృష్ణ ఏఎంసి వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి బి ఆర్ ఎస్ యువ నాయకులు సుభాన్ రెడ్డి ఎన్నెపల్లి షఫీ బిఆర్ హరితేజ ముదిరాజ్ మంచన్పల్లి సురేష్ సుభాష్ ముదిరాజ్ గాండ్ల మల్లికార్జున్ డిస్ట్రిబ్యూటర్ పలయాని శ్రీనివాస్ గౌడ్ మేనేజర్ పలయాని శేఖర్ గౌడ్ అన్వర్ జియో డిస్టిక్ జిల్లా మేనేజర్ శాయిబాజ్ స్టాఫ్ రాజు అనిల్ అజయ్ రామస్వామి సాయి నవీన్ గోపి చందు తదితరులు పాల్గొన్నారు.