బిపిన్ రావత్ అమర్ రహే

Published: Friday December 10, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 9 ప్రజాపాలన ప్రతినిధి : హెలికాప్టర్ క్రాష్ లాండింగ్ ప్రమాదంలో అకాల మరణం చెందిన భారత త్రివిధ దలాధిపతి సిడీస్ జనరల్ శ్రీ బిపిన్ రావత్ గారి మరణం దేశాన్ని దిగ్బ్రాంతి కి గురిచేయ్యడమే కాకుండ శోకాన్ని మిగిల్చింది. బిపిన్ రావత్ ఒక సమావేశంలో ప్రసంగిస్తు ఆర్మీ లో పనిచెయ్యడమంటే వీర మరణం పొందడమే అన్నారు, ఆ మాట ఆయన కోసమే అన్నట్టుగా ఈరోజు ఆయన దేశ సేవలో ఉన్నప్పుడే ప్రమాదంలో చనిపోవడం వీరుని లక్షణం అన్నట్టుగా ఉంది. ఆయనతో పాటు వారి సతీమణి మధులిక గారు మరియు భద్రత సిబ్బంది మరియు ఇతర ఆర్మీ అధికారులు అశువులు బాశారు వారందరి మరణం తీవ్రంగా కలిచివేస్తుంది దేశాన్ని. వారి సేవలు దేశం ఎప్పుడు మరిచిపోదని తెలియజేస్తూ వారికివే మా అశ్రు నివాళులు. బీజేపీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ శాఖా అధ్యక్షులు తూళ్ల నర్సింహా గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబెర్ బోసుపల్లి ప్రతాప్, ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు రమేష్, స్థానిక కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు బిక్షపతి గారు, కోహెడ మాజీ సర్పంచ్ అర్జున్ గౌడ్, మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ యంజాల్ శ్రీనివాస్ రెడ్డి, మాదు శ్రీకాంత్, జిల్లా మహిళా మోర్చా అధికార ప్రతినిధి మాదు రజనీ, యువమోర్చ అధ్యక్షులు ఎలిమినేటి నర్సిహ్మ రెడ్డి, ఉపాధ్యక్షులు మైలారం బాబు గారు, యువ నాయకులు మల్లెల దేవేందర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు సురేందర్ రెడ్డి, బీసీ మోర్చా అజయ్ గౌడ్ గారు, నాయిని చందు, విశ్వంత్ గారు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.