నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
Published: Wednesday June 09, 2021
పరిగి 8 జూన్ ప్రజా పాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనపూర్ గ్రామములో బీజేపీ సీనియర్ నాయకులు మేకల యాదయ్య మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలబిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి ఉచితంగా కోవిడ్ వాక్సిన్ దేశవ్యాప్తంగా అందించాలనే గోపనిర్ణయం తీసుకునేందుకు మరియు 80 కోట్ల ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం దీపావళి వరకు పంపిణీ చేస్తున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ పాల అభిషేకం చేయడం జరిగింది. ఈ కరిక్రమంలో బీజేవైఎం మండల్ ఆదక్షుడు నర్సింలు బిజెపి మండల కార్యదర్శులు ఉపాదక్షులు రాజు, మహేష్, శేఖర్, సిద్దు, నాయకులు పాల్గొన్నారు
Share this on your social network: