ఘనంగా మిర్యాల రాజి రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Tuesday August 03, 2021

బెల్లంపల్లి, ఆగస్టు 2, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ బొగ్గుగని కార్మిక సం (టి బి జి కే ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి జన్మదిన వేడుకలు గోలేటి టౌన్షిప్ లో సోమవారం నాడు ఘనంగా నిర్వహించామని బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు అన్నారు. గో లేటి టౌన్ శిఫ్ లోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కేక్ కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్యాల రాజి రెడ్డి నిస్వార్ధంగా సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు సాధించి పెట్టారని, ఏ కార్మికుడు అయిన అర్ధరాత్రి ఫోన్ చేసి తన సమస్యను చెప్పిన ఓపికగా విని వాటి పరిష్కారానికి కృషి చేశాడని, ఎంతో మంది కార్మికులకు వైద్యానికి సంబంధించిన పరిష్కారం చూపెట్టిన ఘనత రాజిరెడ్డి దని అన్నారు. సింగరేణి కార్మికులకు మరిన్ని హక్కులు సాధించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జి ఎం కమిటీ నాయకులు మారిన వెంకటేశు, మంతు సమ్మయ్య, ఏరియా నాయకులు డి.నర్సింగరావు ఓరం కిరణ్, తదితరుల పాల్గొన్నారు.