మధిర అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందిజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Thursday August 25, 2022

మధిర ఆగస్టు 16 ప్రజాపాలన ప్రతినిధిమధిర అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మల్లారం గ్రామంలో  జిల్లా పరిషత్ నిధుల నుండి మంజూరైన నాలుగు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలను, గుర్తించి,అవి పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులతో మధిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో మధిర నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు  దళిత బంధు లాంటి అనేక పథకాలు ఇతర రాష్ట్రాల్లో సైతం అమలు చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మధిర నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు రాజకీయాలకతీతంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగశెట్టి కోటేశ్వరావు రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు చావా వేణు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరు శ్రీనివాసరావు సర్పంచ్ మందడపు ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.