మునుగోడు లో TRS గెలుపు.... ◆ కొడిమ్వాల లో సంబరాలు

Published: Monday November 07, 2022

కొడిమ్యాల, నవంబర్ 05 (ప్రజా పాలన ప్రతినిధి): కొడిమ్యాల లోని అంగడి బజార్ లో ఆదివారం రోజున మునుగోడు లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కొడిమ్యాల మండల శాఖ అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో  సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి , స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం పార్టీ అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మునుగోడులో ప్రజలు కెసిఆర్  చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టారని టిఆర్ఎస్  గెలుపు బి ఆర్ఎస్ కు కొత్త ఉత్సాహం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ , ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పునుగొటి కృష్ణారావు, కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనర్సింగారావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు ఊట్కూరి మల్ల రెడ్డి సామల లక్ష్మణ్,కొ ఆప్షన్ నసీరొద్దీన్,రైతుబందు అధ్యక్షులు అంకం రాజేశం,పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, నాయకులు కోలాపురం రమేష్,నేరెళ్ళ మహేష్, లింగంపల్లి నరేందర్,గుండు రాజ్ కుమార్,సరిపెల్లి రత్నాకర్, మహంకాళి గంగరాజు,పాదం శీను,ఈరు శంకర్,రాగి రఘునందన్ మొగిలి పాలెం శ్రీనివాస్,బొడ్డు మహేష్,సుంకె నరేష్ అజయ్ రెడ్డి,చెల్ల శ్రీనివాస్,మల్లయ్య,రాజు, తదితరులు పాల్గొన్నారు.