జగిత్యాల తహసీల్ చౌరస్తా లో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహనం

Published: Friday October 28, 2022

జగిత్యాల, అక్టోబర్, 27 ( ప్రజాపాలన ప్రతినిధి): ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ ఆదేశానుసారం కేంద్రం లోని బిజేపి తెలంగాణ కి చెందిన నలుగురు తెరాస ఎమ్మెల్యే లను అప్రజాస్వామ్యం గా డబ్బు  బేరసాలతో కొనాలని  విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ గురువారం జగిత్యాల పట్టణ తహసిల్ చౌరస్తా వద్ద జిల్లా గ్రంధాలయ చైర్మెన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ మోడి దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపినారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నక్క రాధ, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, పట్టణ యూత్ అధ్యక్షులు గిరి, పట్టణ పార్టీ ఉప అధ్యక్షులు ఓల్లెం మల్లేశం, స్థానిక కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.