రైలు కింద జారి పడి వ్యక్తి మృతి
Published: Friday June 17, 2022
బోనకల్, జూన్ 16 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం ఏ రైల్వే గేట్ వద్ద కూలి పనుల నిమిత్తం బయల్దేరిన సంతోష్ కుమార్ రాయి అనే వ్యక్తి సుమారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందినాడు. మృత దేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి బీహార్ రాష్ట్రం బ్యాంకు పూర్ నుంచి బెంగళూరు వెళుతున్న సంతోష్ కుమార్ రాయ్ అనే వ్యక్తి నిద్ర మత్తు లో సంఘమిత్ర రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Share this on your social network: