కేటీఆర్ మీటింగ్ విజయవంతం చేయాలి

Published: Tuesday February 08, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 7 ప్రజాపాలన ప్రతినిధి : ఈనెల 9వ తేదీన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి ప్రోగ్రామ్ పర్యటనకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండల్ తెరాస పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, చిలకల బుగ్గ రాములు, భాస్కర్ రెడ్డి  అధ్యక్షతన మండల పార్టీ కార్యకర్తలు సమావేశం ఈరోజు స్థానిక వైష్ణవి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెరాస పార్టీ రాష్ట్ర యువనాయకులు శ్రీమంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) స్థానిక ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు అని, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు వస్తున్నారని, అందులో భాగంగా గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులు, వివిధ గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు, అలాగే అనుబంధ సంఘాలు లోని విద్యార్థి, యువజన నాయకులు బైక్ ర్యాలీలో పాల్గొన్న పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాపరెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బూడిద రామ్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్లు బిట్ల వెంకటరెడ్డి, మహేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,రాజా శేఖర్ రెడ్డి మండల రైతు కోఆర్డినేటర్ మొద్దు అంజిరెడ్డి, నాయకులు మంద సురేష్, మంకాల దాసు, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు ఏనుగు భరత్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు జెర్కొని రాజు, టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్, మండల పార్టీ ఉపాధ్యక్షులు కాలే గణేష్, డేరంగుల నరసింహ, చెరుకూరి రవీందర్, పోలే కృష్ణ ముదిరాజ్, బల్వంత్ రెడ్డి, రామ్ రెడ్డి, ఉడుతల సతీష్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు నిమ్మల ప్రసాద్ గౌడ్, దొండ మనీష్ రెడ్డి, వినోద్ రెడ్డి, తోట్ల ధ్రువ, శివ రెడ్డి, విజయ్, యాదగిరి, బాషా మైసయ్య, పి.మాధవి, మంగ, శివిరల, జ్యోతి గ్రామాల్లోని ఎంపిటిసిలు సర్పంచ్లు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.