తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన శంకరపట్నం మార్చి10 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Saturday March 11, 2023

శంకరపట్నం మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించి తహసిల్దార్ గూడూరి శ్రీనివాస్ రావు కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలని,
రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని, ధరణి పోర్టల్ కారణంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిరక్షించాలని,
రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని,
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయాలని,
ఉచిత ఎరువుల హామీ వెంటనే అమలు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు మందాడి జగ్గారెడ్డి ,జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి ,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి, శంకరపట్నం మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగా జైపాల్, మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నరేందర్, ఎలుకపెల్లి సంపత్, యువ మోర్చా మండల అధ్యక్షుడు బొడిగ నరేష్,  ఎస్టి మోర్చ మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య, రమణారెడ్డి, నూనె కొండారెడ్డి, పల్లె శివారెడ్డి, రేమిడి రాజిరెడ్డి, బిజెపి నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.