రిపోర్టర్ జమీర్ కుటుంబానికి అండగా ఉంటాం .. --ఎమ్మేల్యే సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ

Published: Saturday July 16, 2022

జగిత్యాల, జూలై, 15 (ప్రజాపాలన ప్రతినిధి): గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు న్యూస్ కవరేజీ కి వెళ్లి వరదల్లో చిక్కుకొని మరణించిన ఎన్టివి రిపోర్టర్ జహీరోద్దీన్  కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి  ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ పరామర్శించినారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్సీ, ఎమ్మేల్యే చెరో 50 వేల చొప్పున వారి కుటుంబానికి 1 లక్ష ఆర్థిక సహాయం, ప్రకృతి వైపరీత్యాలు  పథకం లో భాగంగా ప్రభుత్వం ద్వారా 4 లక్షల రూపాయల పైన అందజేయటానికి కృషి చేస్తామని  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ  హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ లు, మైనార్టీ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు, యువత, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.