మున్సిపల్ సిబ్బందితో మేయర్ జక్క సహపంక్తి భోజనం

Published: Wednesday July 14, 2021
మేడిపల్లి, జూలై13 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్ రెడ్డి తన డివిజన్లో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి తన నివాసంలో బోజనాలు ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి భోజనం చేశారు. అనంతరం 1వ డివిజన్ సిబ్బందికి దూప్పట్లు, లైట్లు, రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ ఎం.శ్రీనివాస్, మేనేజర్ జ్యోతి, డీఈ కె.శ్రీనివాస్, ఏఈ వినీల్ కుమార్, టీపీఎస్ పావని, ఆర్ వో అనిల్ కుమార్, ఎస్ ఐ జగన్మోహన్, నాయకులు మనోరంజన్ రెడ్డి, నిర్మల, వార్డ్ ఆఫీసర్, వర్క్ ఇన్స్పెక్టర్, శానిటేషన్, వాటర్  వర్క్, ఎలక్ట్రీషియన్ సిబ్బంది పాల్గొన్నారు.