ఎ ఎమ్ సి డైరెక్టర్ కు సన్మానం
Published: Monday August 29, 2022
జన్నారం, ఆగస్టు 28, ప్రజాపాలన: పురగిరి క్షేత్రియ పెరిక సంఘం జన్నారం మండల శాఖ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గా రెండవ సారి ఎన్నికైన సందర్భంగా మురిమడుగు గ్రామానికి చెందిన మెంగాని వెంకటేష్ సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగిందని మండల అధ్యక్షుడు తోట లచ్చన్న అదివారం అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల గ్రామల నాయకులు కుదిరే వెంకన్న, ఎంబడి సత్యం, కాండ్రపు భూమన్న, అల్లం లచ్చన్న, ముత్యం రాజన్న, పేరం శ్రీనివాస్, మహేందర్, కానిగంటి లక్ష్మణ్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: