స్నేహితుడి కూతురి వివాహానికి ఫర్నిచర్ అందజేత

Published: Thursday August 05, 2021
జిన్నారం, ఆగస్టు 04, ప్రజాపాలన ప్రతినిధి : స్నేహితుడి కూతురి వివాహానికి మానవత్వంతో ముందుకు వచ్చి పెళ్లి కి కావాల్సిన సుమారు 60వేల రూపాయల విలువైన ఫర్నిచర్ ను అందించారు. జిన్నారం మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు బుక్క వెంకటేష్ కూతురు వివాహానికి కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన బస్శెట్టిగారి సంధ్య వేణు దంపతులు విలువైన ఫర్నిచర్ వెంకటేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. స్నేహితుడి కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకున్న క్లాస్మేట్ వేణు, పెళ్లికి అండగా నిలిచారు. పెళ్లికి కావాల్సిన ఫర్నిచర్ సామాగ్రిని మంగళవారం స్వయంగా అందజేశారు. మిత్రుడు వెంకటేష్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అన్ని రకాల సాయంగా ఉంటానని హామీ ఇచ్చారు. మనకెందుకులే అనుకోకుండా దాతృత్వాన్ని చాటుతూ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారారు. వారి సహాయ సహకారాలకు వెంకటేష్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.