ఎంపీడీవో కార్యాలయం నందు మెమోరండం అందజేత

Published: Friday April 22, 2022
వ్యవసాయ కార్మిక సంఘం పి అంజయ్య
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 21 ప్రజాపాలన ప్రతినిధి : ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం కూలీలా పెండింగ్ బిల్లులుఇవ్వాలని. కూలీలా డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీవో ఆఫీస్ ల ముందు ధర్నాలు చేయాలనే పిలుపులో భాగంగా యాచారంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పేస్లిప్పులు ఇవ్వడం జరిగింది మిగతా సమస్యలు వరంరోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీఇవ్వడంతో ముగిసింది  అనంతరం ఏ పీ ఓ లింగయ్య సార్ ఈసీ శివశంకర్ రెడ్డి కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్షులు పి అంజయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎం రుపేందర్, పి పౌలు. శ్రీరాములు, ఎర్ర జంగయ్య, శోభ, రజియా, పద్మ, మైసమ్మ, యాదమ్మ, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.