విద్యార్థులకు బస్ పాసులు జారీ చేస్తాం

Published: Tuesday August 31, 2021
వికారాబాద్ బస్ డిపో మేనేజర్ దైవాదీనం
వికారాబాద్ బ్యూరో 30 ఆగస్ట్ ప్రజాపాలన : విద్యార్థులకు అన్ని రకాల బస్ పాసులు జారీ చేస్తామని వికారాబాద్ బస్ డిపో మేనేజర్ దైవాదీనం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్, చేవెళ్ళ బస్ స్టాండ్ లో సెప్టెంబర్ 2వ తేదీ నుండి అన్ని రకాల 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు బస్ పాస్ లు జారీపై మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసిందన్నారు. ప్రతి విద్యాసంవత్సరంలాగే ఈ సారి కూడా ఫ్రీ పాస్ లు, రూట్ పాస్ లు, స్టూడెంట్ పాస్ లు, జనరల్ పాస్ లు, ఇవ్వబడునని వికారాబాద్ డిపో మేనేజర్ తెలియజేశారు. ఉదయం 7.00 నుండి సాయంత్రం 6.00 వరకు వికారాబాద్, చేవెళ్ళ బస్ స్టాండ్, బస్ పాస్ కౌంటర్ లో అన్ని రకాల పాస్ లు ఇవ్వబడును. విద్యార్థులు, ప్రజలు అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని వికారాబాద్ డిపో మేనేజర్ దైవాదీనం కోరారు.