సివిల్ జూనియర్ జడ్జి శ్రీకాంత్ వీడ్కోలు సభ

Published: Tuesday October 12, 2021

మధిర అక్టోబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : మధిర  కోర్టు నుండి వికారాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీపై వెళ్తున్న మదిర జూనియర్ సివిల్ జడ్జి శ్రీ కే శ్రీకాంత్ గారికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా న్యాయమూర్తి Sri కే.శ్రీకాంత్ మాట్లాడుతూ బార్, బెంచ్ సమన్వయంతో పని చేసినప్పుడే కక్షిదారులకు సరైన న్యాయం జరుగుతుందని అందుకు సహకరించిన మధిర కోర్టు న్యాయవాదులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ డీ.ధీరజ్ కుమార్ మాట్లాడుతూ మధిర కోర్టుకు ఎంతో చరిత్ర ఉందని ఇలాంటి చరిత్రగల మధిరలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు భైరవభట్ల శ్రీనివాసరావు, న్యాయవాదులు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, నంబూరు జనార్దన్ రావు, దిరిశాల జగన్మోహన్ రావు, దేవరపల్లి సుబ్రహ్మణ్యం, Ev ప్రభాకర్, కట్టా పూర్ణచంద్రరావు చావలి రామరాజు, T.వెంకట్రావు, K.Jnanesh, K. విజయ్ కుమార్, నెల్లూరు రవి, M.సతీష్, జి.శ్రీనివాసరావు కోర్టు సూపర్నెంట్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు....