ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ప్రజా ప్రతినిధులు
Published: Monday April 18, 2022
బెల్లంపల్లి ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి మండలం, చంద్రవెళ్లి గ్రామంలో, నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మహాలక్ష్మీ ఆలయ నిర్మాణ పనులకు, ఆదివారం నాడు ముఖ్యఅతిథిగా హాజరై భూమిపూజ చేసి పనులను ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తోంగల సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేనికుంట్ల ప్రవీణ్, సర్పంచ్ అశోక్ గౌడ్, ఎంపీటీసీ అంకు, ఆకెనపల్లి ఎంపీటీసీ సుభాష్ రావు, మండల తెరాస పార్టీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: