విజ్ఞాన మందిరం కు కలెక్టర్ భూమి పూజ
Published: Thursday April 01, 2021
మహబూబాబాద్, మార్చి 31 ప్రజాపాలన ప్రతినిధి : దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో స్వేరోస్ ఆధ్వర్యంలో విజ్ఞాన మందిరంకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీ పీ గౌతమ్ గారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది. స్వేరోస్ చేపడుతున్న మంచి మంచి కార్యక్రమాలను కలెక్టర్ కొనియాడారు. వారి సేవలను అభినందించారు. నా వంతు సహాయంగా బుక్స్ డొనేట్ చేస్తానని ఆయన అన్నారు. మండల అధికారులు కూడా తమ వంతు సహాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్లు,పీ ఏ సీ యస్ చైర్మన్ రాము, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మల్లారెడ్డి, MRO, గ్రామ సర్పంచ్ అల్లం కృష్ణ, MPTC వెంకన్న, స్వేరోస్ కమిటీ మెంబర్స్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: