వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పౌర్ణమి అన్నదానం. మంచిర్యాల బ్యూరో, జూన్ 14, ప్రజాపాలన :

Published: Wednesday June 15, 2022
మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినెల నిర్వహిస్తున్నట్లుగా పౌర్ణమి సందర్భంగా మంగళవారం రోజు మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ముందు పేదలకు రైల్వే స్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు అన్నదానం నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా దాత గడ్డం సూర్య ప్రకాష్ ఉషా కల్యాణి దంపతుల సహకారంతో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు రేణికుంట్ల శ్రీనివాస్ , కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ , వాసవి క్లబ్ అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొండా చంద్రశేఖర్ , క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్ , రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ చైర్మన్ కాచంసతీష్, వికేయస్పీ  జిల్లా ఇన్చార్జి అప్పాల శ్రీధర్, రీజియన్ కార్యదర్శి నాగిశెట్టి శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ , కార్యదర్శి నలుమాసు ప్రవీణ్ , సభ్యులు పడకండి శ్రీనివాస్, అల్లంకి మహేష్, రమేష్, చందూరి ప్రభాకర్ , గడ్డం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.