ఎల్. రమణ ఎమ్మెల్సీ నామినేషన్ కు హైదరాబాద్ తరలివెళ్లిన టీడీపీ నాయకులు

Published: Wednesday February 24, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 23 (ప్రజాపాలన): తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్. రమణ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం రోజున నామినేషన్ వేస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాద్ తరలివెళ్లారు. రాష్ట్ర కార్యదర్శి దయాల మల్లారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న పార్లమెంట్ అధికార ప్రతినిధి వనమాల నిరంజన్ పట్టణ అధ్యక్షుడు కొండ శ్రీధర్ మండల అధ్యక్షుడు పులి మల్లేశం గౌడ్ రాయికల్ మండల్ కార్యదర్శి కునమల్ల రాజం సీనియర్ నాయకులు వొల్లాల గంగాధర్ బోరుగల్ల శంకర్ సోమ నారాయణ రెడ్డి బత్తుల కొండయ్య వేముల శంకర్ పుట్టవర్తిని చక్రపాణి భాస్కర్ మారుతి తదితరులు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.