వీరుల త్యాగాలను స్మరించుకోవాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ** ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు ప

Published: Saturday August 20, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు19 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఎంతో మంది అమరులతో స్వాతంత్రం సిద్ధించిందని ఎటువంటి వీరుల త్యాగాలను గొప్ప సమయం వచ్చిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా జైలులోని ఖైదీలకు, ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగులకు, అదనపు కలెక్టర్ రాజేశం, ఎమ్మెల్యే ఆత్రం సక్కు లతో కలిసి పండ్లు, స్వీట్లు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  వారితో మాట్లాడి జైల్లో ఆస్పత్రిలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని అలాంటి వారి త్యాగాలను స్మరించుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, జిల్లా వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, సూపరిండెంట్ స్వామి, అధికారులు నాయకులు పాల్గొన్నారు.