ఇంటర్ ర్యాంకర్ చైత్ర తేజాను సత్కరించిన మల్లు నందిని విక్రమార్క

Published: Thursday July 07, 2022

మధిర జూలై 6 ప్రజాపాలన ప్రతినిధి   ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన  నండ్రు చైత్ర తేజను బుధవారం మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాదన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కూడా బాగా చదివి మంచి ర్యాంకులు సాధించి మధిర పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.