ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి *ముగిసిన చర్ల పటేల్ గూడ - సిపిఎల్ -3 క్రికెట్ టో

Published: Wednesday January 18, 2023
ఇబ్రహీంపట్నం మండల కేంద్రం చర్లపటేల్ గూడ గ్రామంలో గ్రామ యువజన సంఘాల  ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఎల్-3 ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ముగింపు కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు.  గ్రామ సర్పంచ్  కంబాలపల్లి గీతారామిరెడ్డి * *ఎంపీటీసీ ఆంజనేయులు*ఇబ్రహీంపట్నం నియోజకవర్గం  బిఆర్ఎస్వి నియోజకవర్గం అధ్యక్షులు నిట్టు జగదశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని  గ్రామ క్రికెట్ క్రీడాకారులు,టోర్నమెంట్ నిర్వాహకులతో కలిసి  టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి, సెకండ్ బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న  యువకులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో కలిసిమెలిసి  టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు గ్రామ యువకులను అభినందించారు,రానున్న రోజుల్లో క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్,బ్యాంకు డైరెక్టర్ సుబురి జంగయ్య, టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పంది మైసయ్య,వార్డ్ సభ్యులు నవీన్ కుమార్ గౌడ్, జకుల మహిపాల్, అనికాల దశరథ,మహీందర్,బతుల శేఖర్,గ్రామ పెద్దలు పాండు రంగా రెడ్డి,కాలే బీరప్ప,గ్రామం యూత్ సభ్యులు పట్నం లింగం,గిరి, సంపత్ యాదవ్, ఇక్క శ్రీశైలం,కృష్ణా, శ్రీరాములు,టోర్నమెంట్ నిర్వాకలు సుధాకర్,శ్రీకాంత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.