*చేవెళ్లలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభ* -కె.వి.ఆర్ గ్రౌండ్ ను పరిశీలించిన బీజ

Published: Wednesday April 19, 2023
చేవెళ్ల ఏప్రిల్ 18,(ప్రజాపాలన):-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా 23వ తేదీన జరిగే చేవెళ్ల పార్లమెంటరీ పరిధిలో జరిగే మహాసభ కు చేవెళ్ల మండల కేంద్రంలో కెవిఆర్ గ్రౌండ్ లో స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి బిజెపి నాయకులు ఏ.చంద్రశేఖర రావు,రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నర్సింహా రెడ్డి, మరియు నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల ప్రకాష్ బిజెపి రాష్ట్ర బృందం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చేవెళ్లలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏడు నియోజకవర్గాల కేంద్రాల నుండి కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు అత్యధికంగా పాల్గొనాలని కోరారు. రానున్న రోజుల్లో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి వెంకట్ రెడ్డి,మండల కార్యదర్శి అత్తెలి అనంతరెడ్డి, వర్రీ తులసి రామ్ విజయ్ కుమార్,అభిలాష రెడ్డి,శేఖర్ రెడ్డి,శర్వాలింగం, వివిధ గ్రామాల మండలాల బిజెపి నాయకులు పాల్గొన్నారు.