మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన గుడాల రాజేష్ గౌడ్

Published: Monday July 19, 2021
జగిత్యాల, జులై 18 (ప్రజాపాలన ప్రతినిధి) : ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త గుడాల రాజేష్ గౌడ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆదివారం రోజున మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల ప్రాంతంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాజేష్ గౌడ్ తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ గొడిసెల రాజేశం గౌడ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మన్ రావు గౌడ్ తదితరులు ఉన్నారు.