ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి *ఓటర్ నమోదు కేంద్రాలను సందర్శించిన ఆర్డీవ
Published: Monday December 05, 2022
,ఇబ్రహీంపట్నం నియోజవర్గంలోని ఇబ్రహీంపట్నం,అబ్దుల్లాపూర్మెట్ యాచారం మంచాల గల వివిధ పోలింగ్ బూత్ లను ఆర్డిఓ వెంకటాచారి ఆదివారం సందర్శించి బూత్ స్థాయి అధికారుల పని తీరును పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పలువురు యువత అత్యధికంగా పాల్గొని తమ ఓటు నమోదు చేసుకోవడం జరుగుతుందనిన్నారు.ఓటర్ నమోదు ప్రక్రియలో నమోదు, అభ్యంతరాలు,మార్పులు చేర్పులు చేయుటకు ఈనెల 8 చివరి తేదీ అని తెలిపారు.ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఓటరు నమోదు చేసుకోవాలని ఆర్డీవో వెంకట చారి సూచించారు. అదేవిధంగా ఓటర్ నమోదు పట్టికలో మృతిచెందిన,వలస వెళ్లిన,ఒక వ్యక్తి పేరు రెండు వేరువేరు ప్రాంతంల్లో ఉంటే సంబంధిత బూత్ స్థాయి అధికారులు గుర్తించి తొలగించాలని ఆర్డిఓ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Share this on your social network: