హిందూ బాదిత కుటుంబానికి మైనారిటీ ల సహాయం.

Published: Tuesday March 15, 2022
దండెపెల్లి, మార్చి14, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లోని తాళ్ల పేట గ్రామంలో ఈ మద్య కాలంలో అనారోగ్యముతో మృతి చెందిన మెడ లక్ష్మి కుటుంబానికి ఆ గ్రామంలో ని మైనారిటీ (ముస్లిం) లు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం, రూ. 1000/- నగదును అందజేశారు. అందరూ కలిసి మెలసి ఉండాలిని మతసామరస్యంగా జీవిస్తూ తోటి వారికి సహాయం చేయాలనే ఈ గ్రామంలోని ముస్లింల ఐక్య తను స్థానిక ప్రజలు అభినందించారు. సహాయం అందించిన వారిలో ముస్తఫా, రహీం, ఉస్మాన్ ఖాన్, ఎస్ కే సాదిక్, సల్లు, సంధాని, షేక్ హైమద్, షబ్బీర్ ఖాన్, అప్సోద్దీన్, సులేమాన్, యూసుబ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.