ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి తలసాని

Published: Friday October 08, 2021
అమీర్ పేట్ జోన్(ప్రజాపాలన ప్రతినిధి) : ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించగలమని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,  ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం గురువారం ఉదయం ఆయన బల్కంపేట్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కి ఈవో అన్నపూర్ణ, మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు.