అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే...

Published: Friday June 25, 2021
జగిత్యాల, జూన్ 24 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల్ అయోధ్య గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు 15 లక్షలతో 4 సీసీ రోడ్లు ఒక డ్రైనేజి నిర్మాణానికి ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అశ్విని జాధవ్ ఏఎంసి చైర్మన్ గన్నే రాజిరెడ్డి సర్పంచ్ జీవన్ రెడ్డి ఎంపీటీసీ భారతి రవీందర్ ఉప సర్పంచ్ రవీందర్ మండల పార్టీ అధ్యక్షుడు కొల శ్రీనివాస్ గంగాధర్ తహశీల్దార్ మహేశ్వర్ ఎంపీవో శ్రీనివాస్ ఏఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.