*జిల్లా లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు*

Published: Thursday March 09, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 08, ప్రజాపాలన: దేశంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ముందుకు సాగుతున్నరని మహిళ అభ్యున్నతే దేశానికి అభ్యున్నతి అని సమాజానికి వెన్నెముకలా సేవలందించే మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించినప్పుడే దేశం పురోగతి చెందుతుందని వారు అన్నారు.
 
*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో*  
 
జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  మాజీ ఎమ్మెల్సీ  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ సూచనల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లను మున్సిపల్ కౌన్సిలర్లు ను కాంగ్రెస్ నేతలు శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మున్సిపల్ డిప్యూటీ ప్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్,ఎస్ సి సెల్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు,కౌన్సిలర్ రామగిరి భానేశ్, బిసి సెల్ మంచిర్యాల జిల్లా చైర్మన్ వడ్డే రాజమౌళి, పూదరి ప్రభాకర్,చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
 
*రాముని చెరువు వాకర్స్ ఆధ్వర్యంలో*   
 
జిల్లా కేంద్రంలోని రాముని చెరువు వాకర్స్ ఆధ్వర్యంలో   అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  
ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలను వాకర్స్ సభ్యులు శాలువా, పూల మాలలతో  అత్తి సరోజ, డా. జ్యోతి, డా. అన్నపూర్ణ,  అడ్వకేట్ పేరం అలేఖ్య, వి. మంజుల, సి. హెచ్,విజయ లక్ష్మి, సురభి స్వాతి, తిరత్ కౌర్,  నసీన బేగం,రెహానా బాను, లలిత రాధమణి,అర్చన,  పద్మలత లను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు గజెల్లి వెంకటయ్య, తిరుపతి,వేముల వీరేశం, గుండేటి యోగేశ్వర్,   తదితరులు పాల్గొన్నారు.
 
*బి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో*
 
 వి వి డి సి కళాశాలలో అంతర్జాతీయ మహిళా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినిలకు వ్యాసరచన పోటీలు కేక్ కటింగ్ మహిళా లెక్చరర్లకు సన్మానం చేశారు.ఈ మంచిర్యాల  నియోజకవర్గం బి ఆర్ ఎస్ వి ఉపాధ్యక్షులు దగ్గుల మధు కుమార్,   ఎన్ఎస్ఎస్ జిల్లా అధికారి ఉదారి చంద్రమోహన్ గౌడ్      నక్క తిరుపతి, గాండ్ల సంజయ్ ,కాటంరాజు, కళాశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
 
*మందమర్రి పట్టణం లో* 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మందమర్రి పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో "మహిళా సదస్సు" కార్యక్రమం, ఆటల పోటీల కార్యక్రమంలో గెలుపొందిన మహిళా పోటీదారులకు మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలలో గెలుపొందిన మహిళా పోటీదారులకు బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, సోషల్ మీడియా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.