హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు సన్మానం

Published: Monday April 04, 2022
జన్నారం రూరల్, ఏప్రిల్ 03, ప్రజాపాలన: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ పద్మనాయక సంక్షేమ మండలి తరఫున నిర్మల్ పట్టణంలో ఇటీవల తెలంగాణ హైకోర్టు లో నూతనంగా న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ శ్రీదేవి, శ్రీహరిరావు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి అదివారం సన్మానించడం జరిగిందని పద్మనాయక సంక్షేమ మండలి జన్నారం అధ్యక్షులు రమేష్ రావు అన్నారు, ఈ కార్యక్రమంలో జన్నారం మండల ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రావు, కోశాధికారి అంజుత్ రావు, ఉపాధ్యక్షులు జన్నారం ఎంపిపి మాదాడి సరోజన రవీందర్ రావు, కమలాకర్ రావు, ఆగమ రావు, దయాకర్ రావు కమలాకర్ రావు మరియు ఇతర సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.