కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్న మేయర్

Published: Monday July 26, 2021
బాలాపూర్, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : అమ్మవారికి బోనం సమర్పించుకున్న కార్పొరేషన్ మేయర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 19వ డివిజన్ కార్పొరేటర్ రామోజీ అమితా శ్రీశైలం చారి ఆధ్వర్యంలోనీ శ్రీ సాయి నగర్ కాలనీలో ఈదమ్మ గుళ్లో బోనాలు కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి బోనం చేసి అమ్మవారికి సమర్పించారు. యావత్ తెలంగాణ ప్రజలతోపాటు కార్పొరేషన్ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కె శ్రీరాం రెడ్డి, కుటుంబ సభ్యులు, కాలనీ అధ్యక్షుడు రాంరెడ్డి, కాలనీ సభ్యులు బాల్ రెడ్డి, పాపయ్య, అనిత తదితరులు పాల్గొన్నారు.