ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి*

Published: Saturday August 27, 2022
బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ డిమాండ్
 
మంచిర్యాల టౌన్, ఆగష్టు 26, ప్రజాపాలన : శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు పెండింగ్ లో ఉన్న పరిహారం వెంటనే చెల్లించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ శ్రీరాంపూర్ డిమాండ్ చేశారు. శుక్రవారం  ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన సింగపూర్,  తాళ్లపల్లి గ్రామాల లోని భూ నిర్వాసితులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు . ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసితులకు పెండింగ్ లో ఉన్న పరిహారం, లావన్ పట్టా, పట్టా భూములు కోల్పోయిన వారికి, సింగరేణిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులుగా  పని చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్న హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని   డిమాండ్ చేశారు. భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం  జిల్లా కలెక్టర్, శ్రీరాంపూర్ జి యం లను కలువ నున్నట్లు తెలిపారు.