ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి *వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు
Published: Monday November 28, 2022
వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర' ఈ నెల 27వ తేదీ ఆదివారం 222వ రోజున 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కట్ట పైన వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరగింది.కావున సుగుణ రెడ్డి మాట్లాడుతూ, ఈ సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వైయస్సార్ సిపి జండా ఎగరాలని బలహీన వర్గాలకు అండగా ఉంటుందని ప్రజా సమస్యల పైన ఉద్యమాలు చేసే విధంగా వైఎస్ఆర్సిపి ఉంటుందని, ధరణి వెబ్సైటు వ్యక్తివేయాలని దానివల్ల అనేకమంది రైతులు భూములు కోల్పోయారని అనేక ఇబ్బందులు వాటిల్లుతుందని ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఇటికల సుగుణరెడ్డి అన్నారు,
Share this on your social network: