నేడుశ్రీరామనవమి సందర్భంగా బారీ ఏర్పాట్లు చేసిన రామాలయం కమిటీ

Published: Thursday March 30, 2023
మధిర, మార్చి 29 ప్రజాపాలన ప్రతినిధి:శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో సాంప్రదాయంలో భాగంగా పీటల మీద జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు- వసంత రాణిలు కూర్చుంటున్నారు.
మధిర లో ప్రసిద్ధిగాంచిన రామాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. నేడు జరిగే శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేడుకలకు కమిటీ చైర్మన్ పల్లబోతుల ప్రసాదరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గత 15 రోజులు నుంచి ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ పల్లబోతుల ప్రసాదరావు తెలిపారు.