జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు

Published: Friday April 14, 2023
* 7.50 కోట్ల నిధులతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం
* 3.6 కోట్ల నిధులతో కేంద్రీయ ఔషధ గిడ్డంగి నిర్మాణం
* వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
* వికారాబాద్ బ్యూరో 13 ఏప్రిల్ ప్రజాపాలన : జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. వికారాబాద్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించి అనంతగిరిలో  రూ. 7.50 కోట్ల వ్యయంతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మాణ పనులకు, అలాగే రూ. 3.6 కోట్లతో కేంద్రీయ ఔషధ గిడ్డంగి నిర్మాణానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు.  అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు  280 పడకల విస్తీర్ణపు నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.  అంతకుముందు మంత్రులు అనంతగిరి గుట్టలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, పరిగి, కొడంగల్,  చేవెళ్ల  శాసన సభ్యులు మెతుకు ఆనంద్, కొప్పుల మహేష్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కాలె యాదయ్యలతో పాటు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వైద్య,  విద్యా శాఖ సంచాలకులు రమేష్ రెడ్డి,  బీసీ కమిషన్ సభ్యులు శుభ్రత్ పటేల్, మున్సిపల్ చైర్మన్  మంజుల రమేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్  విజయకుమార్, ఎంపీపి చంద్రకళ స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.