ప్రకృతి సిద్ధమైన మందులతో సంపూర్ణ ఆరోగ్యం

Published: Monday May 09, 2022
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రకృతిలో లభించే వన మూలికలతో తయారుచేసిన మందులతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ క్లబ్ లో గ్రీన్ క్యురిస్ సంస్థ సహజ సిద్ధంగా దొరికే ఉత్పత్తులతో తయారుచేసిన గో పెయిన్ జన్ను డాక్టర్ వసంత్ కుమార్ తో కలిసి ఆయన నగర మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రకృతిలో లభించే వనమూలికల విశిష్టత తెలిసి వచ్చిందని అన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే లక్షణం కేవలం ఆయుర్వేద విధానంలోనే ఉందని అన్నారు. కీళ్లు, వెన్నునొప్పితో బాధపడుతున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉపశమనం కలిగించే ఉత్పత్తులను తయారుచేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. ప్రజలు సాధ్యమైనంత మేర వ్యాధినిరోధక శక్తిని పెంపొందించు కునేందుకు ప్రకృతిలో లభించే పలు రకాల ఉత్పత్తులను ఉపయోగించాలని డాక్టర్ వసంత కుమార్ కోరారు.