మహాత్ముడికి ఘన నివాళులు

Published: Monday October 03, 2022
జన్నారం, అక్టోబర్ 02, ప్రజాపాలన:  జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీనగర్ లో గాంధీ విగ్రహం వద్ద అదివారం  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపూజీ దేశానికి చేసిన త్యాగం బ్రిటిషలను దేశం నుండి తరిమికొట్టిన విధానాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోర్లకుంటా ప్రభుదాస్, ప్రధానకార్యదర్శి ఫసిఉల్లా, పట్టణ అధ్యక్షులు దూమల్ల రమేష్, బిసి సెల్ అధ్యక్షులు బెనవేణి రాజన్న, ఎస్సీ సెల్ అధ్యక్షులు మామిడిపెళ్లి ఇంద్రయ్య, వార్డు మెంబర్ బెనవేణి గంగన్న, సోషల్ మీడియా రాష్ట కార్యదర్శి హేమంత్ చారి, యూత్ కాంగ్రెస్ నాయకులు మంద రాజేష్, అబ్దుల్ ముజ్జు, దూమల్ల ప్రవీణ్, దూమల్ల ప్రశాంత్, రోహిదాస్, రాహుల్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి అజ్మత్, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area